యాప్నగరం

శ్రీకాకుళం: కుప్పకూలిన రెండంతస్తుల బిల్డింగ్.. భయంతో జనం పరుగులు

ఏపీలో ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో రెండస్తుల భవనం కుప్పకూలిపోయింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 6 Oct 2022, 10:42 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల ధాటికి శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పలాసలోని కేటీ రోడ్డులో చిరు వ్యాపారం నిర్వహిస్తున్న మల్లా కామేశ్వరరావుకు చెందిన రెండు అంతస్తుల భవనం గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న పలాస మండలం శాసనాం గ్రామానికి చెందిన పార్వతీశం టీ దుకాణంపై పడ్డాయి. దీంతో స్థానికంగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
Samayam Telugu పలాసలో కుప్పకూలిన భవనం


అయితే, ఆ భవనంలో జనం ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్‌ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై కరెంట్ సరఫరా నిలిపివేశారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బల్ల గిరిబాబు, తహసీల్దార్‌ మధుసూదన్‌, కమిషనర్‌ రాజగోపాల్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో భవనం కుప్పకూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో వర్షాలకు గోడలు తడిసి కూలిందని అధికారులు తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.