ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల ధాటికి శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. పలాసలోని కేటీ రోడ్డులో చిరు వ్యాపారం నిర్వహిస్తున్న మల్లా కామేశ్వరరావుకు చెందిన రెండు అంతస్తుల భవనం గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న పలాస మండలం శాసనాం గ్రామానికి చెందిన పార్వతీశం టీ దుకాణంపై పడ్డాయి. దీంతో స్థానికంగా గందరగోళ పరిస్థితి నెలకొంది.
అయితే, ఆ భవనంలో జనం ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై కరెంట్ సరఫరా నిలిపివేశారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బల్ల గిరిబాబు, తహసీల్దార్ మధుసూదన్, కమిషనర్ రాజగోపాల్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో భవనం కుప్పకూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో వర్షాలకు గోడలు తడిసి కూలిందని అధికారులు తెలిపారు.
అయితే, ఆ భవనంలో జనం ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై కరెంట్ సరఫరా నిలిపివేశారు. పురపాలక సంఘం అధ్యక్షుడు బల్ల గిరిబాబు, తహసీల్దార్ మధుసూదన్, కమిషనర్ రాజగోపాల్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాశీబుగ్గ పోలీసులు అక్కడకు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో భవనం కుప్పకూలడం.. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పాత భవనం కావడంతో వర్షాలకు గోడలు తడిసి కూలిందని అధికారులు తెలిపారు.