యాప్నగరం

డెలివరీలో బాబు చనిపోయాడన్న డాక్టర్లు... దహన సంస్కరాలు చేస్తుండగా

బిడ్డకు దహన సంస్కరాలు చేస్తుండగా ఒంటిపై ఆపరేషన్ కత్తిగాయాల్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 9 Nov 2020, 6:25 am
కొన్ని ఆస్పత్రులు రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ఎంతో నమ్మకంతో వైద్యం కోసం వారి వద్దకు వస్తే.. సరైన వైద్యం అందివ్వకుండా ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. తాజాగా డెలివరీ కోసం ఆస్పత్రిల ో చేరిన మహిళకు... మృత శిశువు అందిచారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన సికింద్రాబాద్ మారేడ్ పల్లి బసెంట్ హాస్పిటల్‌లో జరిగింది. డెలివరీ సమయంలో బాబు చనిపోయాడంటూ చిన్నారి బంధువులకు తెలిపారు.
Samayam Telugu సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి
child death in basant sahney hospital marredpally


అయితే తల్లిదండ్రులు పసికందుకు దహనసంస్కారాలు చేస్తుండగా శిశువు ఒంటిపై ఆపరేషన్ కత్తిగాయాలు బయటపడ్డాయి. దీంతో వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తలకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్లే బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఏంజరిగిందన్న దానిపై పలువురిని ప్రశ్నిస్తున్నారు.

Read More: ఉగ్రవాదుల కాల్పుల్లో తెలంగాణ జవాను వీర మరణం.. ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి

వారం కిందట వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. డెలివరీ చేస్తుండగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చేతుల్లో బిడ్డ జారి కింద పడ్డాడు. మీర్‌పేటకు చెందిన గర్భిణి(23) శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున ఆరు గంటలకు మగశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలోనుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.