యాప్నగరం

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

బంగారం తీసుకొచ్చిన నిందితులు దుబాయ్ నుంచి విశాఖపట్నం వెళ్లున్నట్లుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి కిలోన్నరకు పైగా బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 26 Oct 2020, 7:01 am
Samayam Telugu బంగారం పట్టివేత
gold seized
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ, ఇద్దరు దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 70.95 లక్షల విలువైన గోల్డ్ బిస్కెట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను ట్వీట్ చేశారు.

Read More: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన మావోయిస్టులు

సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 1.38 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు విమానంలో దుబాయ్ నుంచి విశాఖపట్నం, ఆపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని వారు పేర్కొన్నారు.కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటికప్పుడు అక్రమంగా బంగారం తరలిస్తూ... పలువురు పట్టుబడుతూనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.