చిత్తూరు జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. శనివారం ఒక్కరోజే 49 మంది టీచర్లకు కరోనా నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 219 మంది ఉపాధ్యాయులకు, 11 మంది విద్యార్థులకు కరోనా వచ్చింది. తాజాగా శనివారం మరో 49 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. పీఆర్సీకి వ్యతిరేకంగా వేల మంది ఉపాధ్యాయులు ఈ నెల 20న కలెక్టరేట్ ముట్టడి చేశారు. అప్పటినుంచి పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో శనివారం 1,566 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,64,951కి చేరింది. ప్రస్తుతం జిల్లా వ్యా్ప్తంగా 10,973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1964 మంది కరోనా కాటుకు బలవ్వగా.. 2,52,014 మంది కోవిడ్ను జయించి ఇళ్లకు చేరుకున్నారు. కరోనా కేసులు భారీస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వస్తే.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరుతున్నారు.
మరోవైపు చిత్తూరు జిల్లాలో శనివారం 1,566 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2,64,951కి చేరింది. ప్రస్తుతం జిల్లా వ్యా్ప్తంగా 10,973 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1964 మంది కరోనా కాటుకు బలవ్వగా.. 2,52,014 మంది కోవిడ్ను జయించి ఇళ్లకు చేరుకున్నారు. కరోనా కేసులు భారీస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వస్తే.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరుతున్నారు.