యాప్నగరం

బాలికను కొట్టంలోకి లాక్కెళ్లిన రెండుకాళ్ల పశువు.. చిత్తూరులో దారుణం

పశువుల కొట్టంలోకి చిన్నారిని లాక్కెళ్లి నీచానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.

Samayam Telugu 8 Jul 2021, 7:28 pm
ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. మృగాళ్లకు ఉరిశిక్షలు విధిస్తున్నా కామాంధుల్లో కనీసం భయం కలగడం లేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా పసిమొగ్గలపై కూడా పంజా విసురుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అమానుషాలకు తెగబడుతున్నారు. ఆరేళ్ల బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారయత్నం చేసిన దారుణ ఘటన తాజాగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harass


జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం చిన్నపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డి అనే యువకుడు ఆరేళ్ల బాలికపై నీచానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయం చూసి బాలికను బలవంతంగా పశువుల కొట్టంలోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై పశువులా అత్యాచారయత్నం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కూతురిపై జరిగిన దారుణం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.