యాప్నగరం

ఏ చోట చూసినా జగనన్న.. ఏ నోట విన్నా జగనన్న.. స్టూడెంట్ స్పీచ్‌కు ఫిదా అయిన సీఎం

Jagan: అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్‌ ఐన్‌స్టైన్‌ చక్కగా చెప్పారని.. ముఖ్యమంత్రి జగన్ వివరించారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన కింద 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జ‌మ‌ చేసిన జగన్.. అనంతరం మ‌ద‌న‌ప‌ల్లె బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడటానికి ముందు.. వేదికపై బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని మాట్లాడిన తీరు అందరితో చప్పట్లు కొట్టించింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Nov 2022, 3:37 pm

ప్రధానాంశాలు:

  • మీ పిల్లలను చదివించే బాధ్యత నాదేనన్న జగన్
  • రాక్షసులు, మారీచులతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్య
  • సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నర్సింగ్ స్టూడెంట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu student speaking on stage
వేదికపై మాట్లాడుతున్న సౌజన్య
Jagan: మ‌ద‌న‌ప‌ల్లె బ‌హిరంగ స‌భ‌ వేదికగా.. జ‌గ‌న‌న్న విద్యా దీవెన కింద 11.02లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లు జ‌మ‌ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా.. ములకలచెరువు మండలం, పిల్లొరివారిపల్లికి చెందిన బీఎస్సీ నర్సింగ్ సౌజన్య.. వేదికపై ధైర్యంగా మాట్లాడారు. సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సౌజన్న మాట్లాడుతుంటే.. సభ అంతా చప్పట్లతో మారుమోగింది. ఆ విద్యార్థిని మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆసక్తిగా విన్నారు.
'ఏ చోట చూసినా జగనన్న.. ఏ నోట విన్నా జగనన్న. జగనన్న నదీనామం ప్రజా అభిరుచికి మారుపేరుగా మారింది. మీరు ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రభంజనం. మీరు ఎక్కడ కనబడితే అక్కడ జనసముద్రం. మీరు ఎక్కడ వర్ణిస్తే.. అక్కడ వర్షం. మీరు ఎక్కడ హర్షిస్తే.. అక్కడ హర్షం. ఒక మనిషి కోరిక కొన్ని రోజులే బతికిస్తుంది. ఒక మనిషి ఆశ చనిపోయే వరకు బతికిస్తుంది. ఒక మనిషి ఆశయం చనిపోయిన తర్వాత కూడా బతికిస్తుంది. ఆనాడు వైఎస్సార్ ఆశయం.. ఈనాడు మేం అనుభవిస్తున్న ప్రతిఫలం. ఇవాళ నేను బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నా అంటే.. దానికి కారణం.. విద్యాదీవెన పథకమే. మాకే కాకుండా.. కొన్ని వేలమంది తల్లుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు వేసి.. రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అందుకే మిమ్మల్ని ది డేరింగ్, డాషింగ్ సీఎం అంటున్నారు' అని బీఎస్సీ నర్సింగ్ సౌజన్య జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. 'మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా, పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి.. అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం. విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. పేదలకు చదువును హక్కుగా మార్చాం. చంద్రబాబు హయాంలో పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు చెల్లించాం' అని సీఎం జగన్ వివరించారు.

అటు ప్రతిపక్షాలపైనా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదని కోరుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. నావారు మాత్రమే బాగుపడాలని కోరుకునే మనస్తత్వం నుంచి.. మనుషులంతా ఒక్కటే అన్న జ్ఞానం వీరందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయంటే.. ఫలాన ప్రాంతంలో, ఫలాన పొలాలను ఫలానా రేటుకు అమ్ముకునేందుకు.. ఆ భూముల్లోనే రాజధాని కట్టాలనే ఆలోచన నుంచి వీళ్లందరూ కూడా బయటపడేలా.. వీరికి ఆ దేవుడు జ్ఞానాన్ని, బుద్ధిని పంచిపెట్టాలని దేవుడిని కోరుకునే పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించే మెదళ్లను మార్చాలని.. వీరికి మంచి ఆలోచనలు రావాలని దేవుడిని కోరుకుంటున్నాను' అని జగన్ వ్యాఖ్యానించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.