యాప్నగరం

అప్పుడు ఏమైంది, కొందరు కావాలనే చేస్తున్నారు.. ఏపీలో పరిణామాలపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

గత ఏడాది ఎన్నికల జరపకుండా.. వాయిదా వేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. అధికారులు, నేతలు, ప్రజలు, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.

Samayam Telugu 25 Jan 2021, 9:59 am
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, విగ్రహాల ధ్వంసంపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు. పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేది అన్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలు, ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అన్నారు. తిరుపతిలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా పరిణామాలపై స్పందించారు. గత ఏడాది ఎన్నికల జరపకుండా.. వాయిదా వేయడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. అధికారులు, నేతలు, ప్రజలు, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.
Samayam Telugu నటుడు సుమన్


ఏపీలో విగ్రహాలపై దాడి ఘటన విచారకరం అన్నారు సుమన్. కొందరు కావాలని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. దీనిపై సీఎంను విమర్శించడం, ప్రభుత్వానికి అంటగట్టడం దారుణం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేశారని.. రాష్ట్రం విడిపోయాక కూడా అదే తప్పు జరిగిందన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని.. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోని వచ్చిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలోని పేద మహిళలకు లక్షలాది ఇంటిపట్టాలు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు. ప్రతి రాష్ట్రంలోని పాలకులు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ సీఎంను ఎన్నుకున్నారని.. సాధారణ మధ్య తరగతి ప్రజలు పరిపాలన విషయంలో సంతోషంగా ఉన్నారన్నారు. వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.