యాప్నగరం

తిరుపతి జిల్లావాసులకు గుడ్‌న్యూస్.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్

ఏపీలో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించింది కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.. ఆ వివరాలను వెల్లడించారు. రెండు తిరుపతి జిల్లా పరిధిలోనే వస్తున్నాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Aug 2022, 3:35 pm

ప్రధానాంశాలు:

  • ఏపీకి కొత్తగా రెండు ప్రాజెక్టులు వచ్చాయి
  • ట్వీట్ చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
  • రెండూ తిరుపతి జిల్లా పరిధిలోనే ఉన్నాయి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nitin Gadkari
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. భారతమాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రహదారుల విషయాన్నితెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రూ.909.47 కోట్లతో చిల్లకూరు క్రాస్‌ రోడ్‌ నుంచి తూర్పు కనుపూరు వరకు నాలుగు లేన్‌లతో.. మొత్తం 36.05 కి.మీ పొడవుతో యాక్సెస్‌ కంట్రోల్డ్‌ హైవే నిర్మాణం జరగనుంది అన్నారు. ఇటు నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్‌) నుంచి తూర్పు కనుపూరు వరకు రూ.1,398.84 కోట్లతో మొత్తం 34.881 కి.మీ పొడవుతో ఆరులేన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
మరోవైపు అదానీ గ్రూప్‌ ఎంఏఐఎఫ్‌ ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని టోల్‌ రహదారుల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఏఆర్‌టీఎల్‌) ద్వారా ఈ డీల్‌ చేసుకుది. ఎస్‌టీపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు టోల్‌ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి నేషనల్‌ హైవే 16పై తడ నుంచి నెల్లూరు (110 కి.మీ.) వరకు ఉంది. మరొకటి నేషనల్‌ హైవే 65పై నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం- విజయవాడ వరకూ(48 కి.మీ.) ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.