యాప్నగరం

అసెంబ్లీ ఉన్నా సీఎం జగన్ అనుమతి తీసుకున్నా.. ఆడపడుచుగా వచ్చా: మంత్రి రోజా

మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో పర్యటించారు. అక్కడ గంగమ్మ జాతర ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అసెంబ్లీ ఉన్నా ఆడపడుచుగా వచ్చానన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Sep 2022, 11:41 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Minister Roja
ఏపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో పర్యటించారు. నగరి నియోజకవర్గ ఆడపడుచుగా నన్ను ఆదరించిన మహిళల కోసం అసెంబ్లీ జరుగుతున్నా వచ్చానని రోజా అన్నారు. నగరి గంగమ్మ జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా మహిళలకు చీరలు అందించారు. నగరి దేశమ్మ, ఓరుగుంటాలమ్మ ఆలయంలో మహిళలకు వస్త్రాలు అందించారు. ప్రతి ఏడాది జాతర ఉత్సవాలను మహిళలతో కలిసి నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారిందని.. ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రిని అనుమతి కోరగా.. ఆయన అందరి కోసం పంపించారని చెప్పారు. అనంతరం మంత్రి దంపతులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ విషయాన్ని మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నగరిలో జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా.. గ్రామ దేవతలు శ్రీ దేశమ్మ తల్లి, శ్రీ ఓరుగుంటలమ్మ తల్లి విశేష పూజలలో పాల్గొని రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, గ్రామ మహిళలతో కలిపి మొత్తం 1,400 మందికి చీరలు, ధోవతులు అందజేయడం జరిగింది అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.