యాప్నగరం

Srikalahasti Fin care చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. స్రవంతినే అసలు దొంగ, పెద్ద డ్రామానే!

Srikalahasti Fin Careలో దొంగతనం వ్యవహారంలో ఊహించని మలుపు బయటపడింది. వచ్చే గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. మేనేజర్‌ నోట్లో గుడ్డలు కుక్కి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 May 2022, 3:37 pm

ప్రధానాంశాలు:

  • స్రవంతితో పాటూ మరో ముగ్గురి పాత్ర ఉంది
  • గిల్టు నగలతో సంస్థలో లోన్లు తీసుకున్న స్రవంతి
  • బండారం బయటపడుతుందని దొంగతనం డ్రామా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శ్రీకాళహస్తి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సంచలనం రేపిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ఫిన్‌కేర్‌ (Srikalahasti Fin Care)లో చోరీ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో మేనేజర్ స్రవంతి ఈ దొంగతనం వెనుక ఉన్నట్లు తేల్చినట్లు తెలుస్తోంది. స్రవంతి చెన్నైకు చెందిన ముగ్గురు యువకులతో కలిసి చోరీ చేసినట్లు డ్రామాలాడినట్లు ప్రాథమికంగా నిర్థారించారట. ఆమె గిల్టు నగలతో పనిచేసే సంస్థలో లోన్ తీసుకున్నారు.. ఒకవేళ ఆడిట్ నిర్వహిస్తే తన బండారం అంతా బయటపడుతుందని భావించి ఈ చోరీ నాటకం ఆడించినట్లు చెబుతున్నారు.
ఈ కేసులో అసలు నిజాన్ని స్రవంతి నుంచే రాబట్టి రికవరీ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. స్రవంతి ఆర్థిక ఇబ్బందులతోనే పనిచేస్తున్న బ్యాంకుకు కన్నం వేసినట్లు గుర్తించారు. బ్యాంకు లో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి స్రవంతి అడ్డంగా దొరికిపోయింది. గత నాలుగేళ్లుగా ఫిన్ కేర్‌లో ఆమె పని చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

శ్రీకాళహస్తిలోని పెద్దమసీదు వీధిలో మూడేళ్లుగా ఫిన్‌కేర్ ఫైనాన్స్ సంస్థ ఉంది. గత గురువారం సిబ్బంది అందరూ రాత్రి ఇళ్లకు వెళ్లిపోయారు. మేనేజర్ స్రవంతి మాత్రం రాత్రి 10.30 సమయంలో పెండిగ్ వర్క్ ఉంటే చేసుకుంటున్నట్లు చెప్పారు. ఇంతలో ముగ్గురు దుండగులు కంపెనీ లోపలికి వచ్చారని.. తనను బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టేశారని చెబుతున్నారు.

ఆ దుండుగులు కంపెనీలో ఉన్న 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, రూ.5 లక్షల డబ్బును దోచుకెళ్లారని ఆరోపించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే స్రవంతి తీరుపై అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.