యాప్నగరం

తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు.. సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్

Somu Veerraju తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మంత్రులు తిరుమలలో అన్యమతం ప్రార్థనలు చేశారంటూ బాంబ్ పేల్చారు. వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Sep 2022, 12:58 pm

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Somu Veerraju
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చిన ఆయన.. పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో రియల్ టైమ్ అభివృద్ధి జరగాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నాను అన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద తీర ప్రాంతం ఉందని.. అభివృద్దికి అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నుంచి ప్రజల్ని ఆ వెంకటేశ్వరస్వామి రక్షించారన్నారు.
ఏపీ సిఎస్ ,డీజీపీలు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు సోము. రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. ప్రభుత్వం స్టిక్కర్ కంపెనీగా మారిపోయింది అన్నారు. కేంద్ర నిధులతో ఏపీలో పాలన సాగుతోందని.. డబ్బు కేంద్రానిది ప్రచారం వైఎస్సార్‌సీపీది అంటూ మండిపడ్డారు. ఏపీలో అవినీతి జరుగుతోందని.. ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియా పాలన సాగుతోందన్నారు. సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని.. జాతీయ రహదారులను కేంద్రం నిధులతో నిర్మిస్తే ఏపీలో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. ప్రజా క్షేత్రంలో ఏపీ ప్రభుత్వంపై తేల్చుకుంటామని.. ప్రతి నియోజకవర్గంలో కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి, కార్యక్రమాలపై బ్లూ ప్రింట్ తయారు చేశామన్నారు. రెవిన్యూ , పోలీస్ వ్యవస్థలు ఏపీలో అధికార పార్టీకి తొత్తులుగా మారాయని విమర్శించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పాలనా వ్యవస్థా అధికార పార్టీకి తాబేదారులుగా మారారని తీవ్ర విమర్శలు చేశారు.

సోము వీర్రాజు ఏకంగా మంత్రుల్ని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏకంగా తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగాయనడం సంచలనంరేపుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా బీజేపీ తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా మంత్రుల్ని టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.