ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా (Minister Roja).. గ్రౌండ్లో దిగి బ్యాట్ పట్టారు. అంతేకాదండోయ్.. విద్యార్థులతో పోటీపడి మరీ కబడ్డీ ఆడారు. వాలీబాల్ లోనూ తన నైపుణ్యం చూపించారు రోజా. నగరి డిగ్రీ కళాశాల ఇందుకు వేదికగా మారింది. నగరి డిగ్రీ కళాశాలలో.. జగనన్న క్రీడా సంబరాలను ఆర్.కే.రోజా సోమవారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్, కబడ్డీ ఆడి వారిని ప్రోత్సహించారు మంత్రి. ఈ పోటీలలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమన్నారు మంత్రి రోజా. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక టీమ్ ను పంపిస్తారని, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్లకు.. జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు రోజా. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేందుకు ఇది గొప్ప అవకాశమని వివరించారు. క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్న రోజా.. డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు నాడు విజేతలకు అవార్డులు అందిస్తామని వివరించారు.
- Read LatestAndhra Pradesh News and Telugu News