తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరుడికి ఓ భక్తుడు భారీ కానుకలు అందజేశారు. బెంగళూరుకు చెందిన మల్లాడి బాలసుబ్రహ్మణ్యం, మల్లాడి నాగేశ్వరరావు దంపతులు ఆలయానికి వెండి అంబారీలను కానుకగా అందజేశారు. రూ.1.36 కోట్ల వ్యయంతో అంబారీలు చేయించారు.. ఉత్సవమూర్తులైన జ్ఞానాంబిక, సోమస్కందమూర్తి పురవీధుల్లో విహరించేందుకు వీలుగా వెండితో వీటిని తయారు చేయించారు. మరోవైపు శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 13 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. 13న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా అంకుర్పాణ నిర్వహించారు. 14న వాయులింగేశ్వర స్వామివారి ధ్వజారోహణం, 15న భూతరాత్రి భూత, శుక వాహన సేవలు, 16న గాంధర్వరాత్రి రావణ, మయూర వాహన సేవలు, 17న నాగరాత్రి శేష, యాళీ వాహన సేవలు ఉంటాయి.
18న మహాశివరాత్రి అనంతరం రాత్రి నందిసేవ.. 19న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం జరగనుంది. 20న తేదీన శివపార్వతుల కల్యాణోత్సవం.. 21న ఆనందరాత్రి శివకామసుందరి, 22న గిరిప్రదక్షిణ, 24న పల్లకీ సేవ, 25న ఏకాంతసేవలు నిర్వహించనున్నారు. 26న శాంతి అభిషేకాలతో ఉత్సవాలు ముగుస్తాయి.
18న మహాశివరాత్రి అనంతరం రాత్రి నందిసేవ.. 19న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం జరగనుంది. 20న తేదీన శివపార్వతుల కల్యాణోత్సవం.. 21న ఆనందరాత్రి శివకామసుందరి, 22న గిరిప్రదక్షిణ, 24న పల్లకీ సేవ, 25న ఏకాంతసేవలు నిర్వహించనున్నారు. 26న శాంతి అభిషేకాలతో ఉత్సవాలు ముగుస్తాయి.
- Read Latest Andhra Pradesh News and Telugu News