ఆఫ్లైన్లో ప్రతిరోజు 15 వేల టికెట్లు ఇస్తామన్న టీటీటీ ప్రకటనతో వేలాదిమంది తిరుపతికి చేరుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు. వారందరూ రెండు మూడు రోజుల తర్వాత తేదీల్లో దర్శనం టికెట్లు పొంది.. తిరుమలకు వెళ్లలేక తిరుపతిలో తిండి తిప్పలతో అవస్థలు పడుతున్నారని అన్నారు. సామాన్య శ్రీవారి భక్తులను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారు..? అని ప్రశ్నించారు.
సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం, వసతి, అన్న ప్రసాదం పంపిణీపై ధ్యాస ఉందా..? అని ఆయన నిలదీశారు. ఆర్జిత సేవా టికెట్లు ధరల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఉద్దేశంతో భక్తులను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు..? హిందూ భక్తులపై వివక్ష చూపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఆఫ్లైన్లో రోజూ రూ.300 టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇవ్వాలని కోరారు. ఉచిత దర్శనాల టోకెన్లను భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ రోజుకారోజు విడుదల చేసి బయట ప్రాంతాల భక్తులు పడిగాపులు కాచే పనిలేకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.
తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల రద్దు నిర్ణయాన్ని టీటీడీ విరమించుకోవాలని సామంచి శ్రీనివాస్ కోరారు. కొండపై దశాబ్దాల కాలంగా జీవించే ప్రైవేట్ హోటళ్ల వారి కడుపు కొట్టడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భుజించే.. అన్ని రకాల వంటకాలను టీటీడీ అందించలేదన్నారు. అన్ని రుచులను ప్రైవేట్ హోటల్స్ నిర్వాహకులు అందించగలరని.. దీనికి తార్కాణం గతంలో తిరుమల హోటల్స్లో రుచులే అన్నారు. వీరిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం, వసతి, అన్న ప్రసాదం పంపిణీపై ధ్యాస ఉందా..? అని ఆయన నిలదీశారు. ఆర్జిత సేవా టికెట్లు ధరల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఉద్దేశంతో భక్తులను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు..? హిందూ భక్తులపై వివక్ష చూపుతున్నారా..? అంటూ ప్రశ్నించారు. ఆఫ్లైన్లో రోజూ రూ.300 టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇవ్వాలని కోరారు. ఉచిత దర్శనాల టోకెన్లను భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ రోజుకారోజు విడుదల చేసి బయట ప్రాంతాల భక్తులు పడిగాపులు కాచే పనిలేకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు.
తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల రద్దు నిర్ణయాన్ని టీటీడీ విరమించుకోవాలని సామంచి శ్రీనివాస్ కోరారు. కొండపై దశాబ్దాల కాలంగా జీవించే ప్రైవేట్ హోటళ్ల వారి కడుపు కొట్టడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భుజించే.. అన్ని రకాల వంటకాలను టీటీడీ అందించలేదన్నారు. అన్ని రుచులను ప్రైవేట్ హోటల్స్ నిర్వాహకులు అందించగలరని.. దీనికి తార్కాణం గతంలో తిరుమల హోటల్స్లో రుచులే అన్నారు. వీరిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.