యాప్నగరం

వాళ్ల నుంచి కాపాడండి సార్.. ఎస్సై కాళ్లు పట్టుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త!

వైసీపీ నేతల నుంచి కాపాడాలంటూ చిత్తూరులో ఇండిపెండెంట్ అభ్యర్థి భర్త ఎస్సై కాళ్లు పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది.

Samayam Telugu 10 Mar 2021, 4:13 pm
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి రక్షించాలని వేడుకుంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థి భర్త ఎస్సై కాళ్లు పట్టుకోవడం కలకలం రేపింది. చిత్తూరు మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు 29వ డివిజన్‌లో వైసీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వనిత భర్త శ్రీనివాసులు ఆరోపించారు. వారి రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తనపై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
Samayam Telugu ఎస్సై కాళ్లుపట్టుకున్న అభ్యర్థి భర్త


పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని శ్రీనివాసులు వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసులు.. ఎస్ఐ కాళ్లు పట్టుకున్నారు. వైసీపీ నేతల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనలో చిత్తూరులో కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.