యాప్నగరం

చిత్తూరు: షాపులో చోరీ ఘటన.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై జైల్లో మృతి

సీసీ టీవీ ఫుటేజీలో చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 16 Sep 2021, 2:44 pm

ప్రధానాంశాలు:

  • ఈ నెల 4న చోరీ ఘటన
  • ఈ కేసులో జైల్లో ఏఎస్సై
  • అనారోగ్యంతో మరణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు జిల్లా
ఓ దుకాణంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై మృతి చెందారు. ఓ దుకాణంలో దుస్తులు చోరీ చేసినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఏఎస్సైని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ ఖైదీగా జైల్లో ఉన్న ఆయన గురువారం ఉదయం అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో చిరువ్యాపారులు తోపుడు బండ్లపై బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. రాత్రి కాగానే సమీపంలోని ఓ గదిలో పెట్టి వెళ్లిపోతుంటారు. సెప్టెంబర్ 4న అర్ధరాత్రి వేళ అటుగా వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. షాప్ లోకి వెళ్లి దుస్తులు దొంగిలించారు. ఒక కానిస్టేబుల్ బట్టలు దొంగిలిస్తుండగా.. ఏఎస్సై బయట కాపలా ఉన్నారు.

ఇద్దరు పోలీసులు దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఉదయాన్నే షాపు వద్దకు వచ్చిన యజమాని బట్టలు చోరీకి గురైన విషయం తెలుసుకొని ఆందోళన చెందాడు. సీసీ ఫుటేజీ చూడగా దొంగతనానికి పాల్పడింది పోలీసులే అని తెలుసుకొని షాకయ్యాడు. అనంతరం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.