యాప్నగరం

చిత్తూరు: అత్యాశకు పోయాడు, రూ.8లక్షలు ఫట్.. మరీ అమాయకంగా, బీ అలర్ట్

తక్కువ ధరకు బంగారం వస్తుందన్న అత్యాశకు పోయి ఓ వ్యక్తి రూ.8లక్షలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు సంతపేటలో స్నేహితుడి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి.

Samayam Telugu 13 Oct 2021, 11:43 am

ప్రధానాంశాలు:

  • చిత్తూరు జిల్లాలో మోసం
  • తక్కువ ధరకే బంగారమని
  • రూ.8లక్షలు పోగొట్టుకున్నాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు జిల్లా
ఇటీవల కాలంలో మోసాలు పెరిగాయి. తక్కువ ధరకే బంగారం పేరుతో కొందరు కేటుగాళ్లు అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా తక్కువ ధరకు బంగారం వస్తుందన్న అత్యాశకు పోయి ఓ వ్యక్తి రూ.8లక్షలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు సంతపేటలో నివాసం ఉంటోన్న దినేష్‌కు తక్కువ ధరకు దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన బంగారాన్ని ఇప్పిస్తానని దగ్గర బంధువైన భరత్‌ చెప్పాడు. పైగా తమిళనాడు, కృష్ణగిరి ప్రాంతాల్లో ఇలాంటి బంగారం అమ్మేవాళ్లు తనకు తెలుసని నమ్మించాడు.
దినేష్‌ వారి మాటలు నిజమని నమ్మాడు. తక్కువ ధరకు బంగారం వచ్చేస్తుందన్న ఆశతో ఆన్‌లైన్‌ ద్వారా రూ.8లక్షలను భరత్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. డబ్బు తీసుకున్నాక బంగారం ఇప్పించక పోవడంతో అనుమానం వచ్చి భరత్‌ను నిలదీశాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.