యాప్నగరం

చిత్తూరు జిల్లాలో విషాదం.. రైలు కింద పడి ఇంజినీరింగ్ కాలేజీ అధిపతి ఆత్మహత్య!

చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేేసుకుంది. ఎంజేఆర్ కాలేజీ అధిపతి వెంకట రమణా రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 11 Feb 2021, 10:13 pm
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పీలేరు-చిత్తూరు రోడ్డులోని అగ్రహారం సమీపంలో ఉన్న ఎంజేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అధిపతి ఎం. వెంకట రమణారెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే... ఎంజేఆర్ కాలేజీ సమీపం నుంచి.. పులిచర్ల మండలానికి వెళ్లే మార్గంలోని రైల్వే గేట్ వద్దకు చేరుకున్న వెంకట రమణా రెడ్డి తిరుపతి కాచిగూడ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Samayam Telugu train
Representative image.


రైలు వేగంగా దూసుకెళ్లడంతో.. వెంకట రమణారెడ్డిని 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆయన శరీర భాగాలు గుర్తుపట్టలేనంత ఛిద్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానిక అధికారులు, రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. పీలేరు పులిచెర్ల మండలాలకు చెందిన పలువురు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందింది ఎంజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత అనే నిర్ధారణకు వచ్చారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చనేది పోలీసుల విచారణలో బయటకొచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.