ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చనిపోయారని సంతాపం వ్యక్తంచేస్తూ వాట్సాప్ స్టేటస్లలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు నాగార్జున నాయుడు వాట్సాప్ స్టేటస్లలో దీంతో నాగార్జుననాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తల పేర్లు బయటకు రావడంతో పులిచెర్లకు చెందిన హరినాథ్, సోమలకు చెందిన వెంకటసుబ్బయ్యలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పీలేరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు.
చిత్తూరు: సీఎం జగన్పై అసభ్యకర పోస్టులు.. మరీ దారుణంగా, ముగ్గురి అరెస్ట్
సీఎం జగన్పై గురువారం సంతాప పోస్టులు పెట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైస్ ఎంపీపీ విజయశేఖర్బాబు దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ కార్యకర్త నాగార్జుననాయుడుపై రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu 23 Oct 2021, 9:20 am
ప్రధానాంశాలు:
- చిత్తూరు జిల్లా పుంగనూరులో
- సీఎం జగన్పై అసభ్యకర పోస్టులు
- ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు