చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలంరేపింది. కల్లూరు మండలం ముల్లంగివారిపల్లెకు చెందిన మహిళ ఈశ్వరి ఇంటిలో గుప్త నిధుల కోసం ఓ ముఠా తవ్వుతుండగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, కర్ణాటకకు చెందిన గ్యాంగ్.. ఈశ్వరిని అదే గ్రామానికి చెందిన బాలు భయపెట్టి, మాయమాటలు చెప్పారు. ఇంటిలో గుప్త నిధుల కోసం శుక్ర, శనివారం రాత్రి సమయాల్లో తవ్వకాలు చేపట్టారు. ఇంట్లో నుంచి తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు వస్తున్నాయి.. స్థానికులకు కూడా అనుమానం కలిగింది. బాలసుబ్రహ్మణ్యంతో పాటు చిత్తూరుకు చెందిన ఎం.శభరినాథన్, సయ్యద్ మస్తాన్, హైదరాబాద్కు చెందిన పి.సుధాకర్, కర్ణాటక రాష్ట్రం బెలగామ్ జిల్లాకు చెందిన పి.మహమ్మద్, మహమ్మద్ షాజీద్ ఖాన్ ముఠాగా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్ రెండు రోజులుగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు. శనివారం ఈశ్వరి ధైర్యం చేసింది.. స్థానికులతో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం అగ్రహారం సమీపంలోని ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో తవ్వకాలు జరిపిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ గతంలో కూడా తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.
చిత్తూరు: రాత్రిళ్లు ఓ ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. స్థానికులకు అనుమానం, లోపల సీన్ చూసి షాక్!
రెండు రోజులుగా ఇంట్లో నుంచి శబ్దాలు వస్తున్నాయి.. స్థానికులకు కూడా అనుమానం కలిగింది. శనివారం ఈశ్వరి ధైర్యం చేసింది.. స్థానికులతో కలిసి ఫిర్యాదు చేశారు.
Samayam Telugu 2 Aug 2021, 11:37 am
ప్రధానాంశాలు:
- చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల ముఠా
- ఓ ఇంట్లో రాత్రి సమయంలో గుట్టుగా
- స్థానికులకు అనుమానం రావడంతో