యాప్నగరం

సీఎం జగన్‌కు గుడి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. బాబోయ్ అంత ఖర్చు చేశారా?

రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి ఇలా పథకాల పేరుతో భారీ స్థూపాలు నిర్మించారు. నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Samayam Telugu 20 Aug 2021, 3:20 pm

ప్రధానాంశాలు:

  • జగన్‌పై ఎమ్మెల్యే అభిమానం
  • ఏకంగా ఆలయాన్ని కట్టించారు
  • భార్య, పిల్లల కంటే ఎక్కువట
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి. ఏకంగా ఆలయాన్ని నిర్మించారు.. నవరత్నాల పేరుతో గుడిని కట్టేశారు. రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి ఇలా పథకాల పేరుతో భారీ స్థూపాలు నిర్మించారు. అలాగే పేదలకు ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను ఏర్పాటు చేశారు. నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి సుమారు రూ.2 కోట్ల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. తన అభిమాన నాయకుడిపై ప్రేమతో ఇలా అభిమానాన్ని చాటుకుంటున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.

తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా తనకు జగనే ముఖ్యమన్నారు ఎమ్మెల్యే. రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్‌కు తాను అలాగే అన్నారు. మొదటిసారి ఓడిపోయిన తనకు మళ్ళీ టికెట్ ఇచ్చి జగనన్న గెలిపించారని.. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునే అందుకే ఈ నవరత్నాల ఆలయం నిర్మించాను అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలు ఎంతో ఆనందగా ఉన్నారని.. ఏదో ఉడతా భక్తిగా ఇలా ఆలయాన్ని కట్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.