యాప్నగరం

చిత్తూరు: అనుమానాస్పద వస్తువు కలకలం.. ఉలిక్కిపడ్డ స్థానికులు, తీరా ఆరా తీస్తే

యర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో అనుమానాస్పద వస్తువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Samayam Telugu 31 Jul 2021, 10:41 am

ప్రధానాంశాలు:

  • బెలూన్‌కు బ్యాటరీ, డిటెక్టర్, గొడుగు
  • అనుమానాస్పదంగా కనిపించిన వస్తువు
  • ఆ వస్తువును పరిశీలించిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద వస్తువు కలకలంరేపింది. యర్రావారిపాలెం మండలం కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో బ్యాటరీ, సిగ్నల్‌ డిటెక్టర్, గొడుగు, బెలూన్లతో కూడిన ఎలక్ట్రానిక్‌ పరికరం కలకలం రేపింది. ఆ వస్తువుని చూసి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బెలూన్‌కు అమర్చబడి ఉన్న ల్యాబ్‌కు చెందిన రీసెర్చి పరికరం, కంప్యూటర్‌లో అమర్చే చిప్‌ పరికరాలను గుర్తించారు.
పోలీసులు ఆ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాతావరణ అధ్యయనానికి గాల్లోకి బెలూన్‌ సాయంతో దీన్ని పంపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్థారించారు. వాతావరణంపై పరిశోధన చేయడానికి విద్యార్థులు ఈ పరికరానికి బెలూన్‌ అమర్చి ఆకాశంలో వదిలి ఉంటారని.. బెలూన్‌ పగిలిపోవడంతో ఇది కిందపడిందని చెబుతున్నారు. దీని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదనడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.