యాప్నగరం

చిత్తూరు: సచివాలయంలో మన్మధ రాజా.. రెచ్చిపోయిన ఇద్దరు వాలంటీర్లు, వీడియో వైరల్

చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. సూపర్‌వైజర్ అధికారి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ తనూజలను విచారణ అధికారులుగా నియమించారు.

Samayam Telugu 17 Sep 2021, 8:01 am

ప్రధానాంశాలు:

  • సచివాలయంలో వాలంటీర్ల డ్యాన్స్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఇద్దరు వాలంటీర్లపై చర్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చిత్తూరు
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వాలంటీర్లు డ్యాన్సుల వీడియో వైరల్ అయ్యింది. కట్టమంచి 4వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహించకుండా మన్మధ రాజా.. మన్మధ రాజా అంటూ మౌనిక-జగదీష్ అనే వాలంటీర్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సచివాలయంలో ఇదేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.
దీంతో చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. సూపర్‌వైజర్ అధికారి శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ తనూజలను విచారణ అధికారులుగా నియమించారు. అనంతరం విచారణ చేపట్టి నివేదికను కమిషనర్‌కు ఇచ్చారు. దీంతో ఇద్దరు వాలంటీర్లు జగదీష్, మౌనికలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.