కొత్త ఉద్యోగం వచ్చిందని పాత భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడో భర్త. ఆమె ఊరుకుంటుందా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏకంగా సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గుండావారి పల్లికి చెందిన రామాంజులుకు.. కురబలకోట మండలం అంగళ్లకు చెందిన కళావతితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు.. కాపురం కూడా సాఫీగా సాగిపోతోంది. ఇంతలో రామాంజులుకు ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తి అయ్యాక భార్య , పిల్లలను భర్త పట్టించుకోవడం మానేశాడు. తనను, పిల్లలను చూసుకోవాలని కళావతి కోరింది.. అతడు మాత్రం పట్టించుకోలేదు. తర్వాత తనను వద్దంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటేశాడని భార్య ఆరోపిస్తున్నారు. రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఆమె చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. న్యాయం చేస్తామంటూ అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు.
చిత్తూరు: కొత్త ఉద్యోగం రావడంతో భార్యను గెంటేశాడు.. భర్తకు దిమ్మ తిరిగే షాక్
రామాంజులుకు ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తి అయ్యాక భార్య , పిల్లలను భర్త పట్టించుకోవడం మానేశాడు. తనను, పిల్లలను చూసుకోవాలని కళావతి కోరింది.. అతడు మాత్రం పట్టించుకోలేదు.
Samayam Telugu 21 Sep 2021, 11:04 am
ప్రధానాంశాలు:
- ఇటీవలే భర్తకు ఉద్యోగం వచ్చింది
- భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా
- భర్తకు షాకిచ్చిన భార్య