యాప్నగరం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో జగన్.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 27 Sep 2022, 8:57 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్‌.. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు పట్టు వస్త్రంతో సీఎం జగన్‌ తలకు పరికట్టం కట్టారు.
Samayam Telugu తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్


అంతకు ముందు సీఎం జగన్ తిరుమల కొండపై ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, సీఎం జగన్‌.. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌‌కు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.