ఆంధ్రప్రదేశ్ పూర్తిగా విద్యుత్ సంక్షోభంలోకి వెళ్లబోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే నెలలోనే ఇళ్లకు కరెంట్ ఉంటుందో చెప్పలేని దుస్థితి నెలకొందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో పేద ప్రజల నవరంధ్రాలు మూసివేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవని.. చదువుకోవాలంటే పేద విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యే పరిస్థితి ఉందని సంచలనం రేపారు. అందుకే 80 లక్షల విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ లోపు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో స్కాలర్షిప్లతో చదువుకున్న రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారని చింతా మోహన్ అన్నారు. పేదవాడికి అన్యాయం జరుగుతుంటే.. సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు పని తీరు కూడా అలాగే ఉందన్నారు.
ఇక, ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతా మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదానీ అభివృద్ధి కాదని.. పేదల అభివృద్ధి కావాలన్నారు. ఇక, చంద్రబాబు తొందరబాబుగా మారారన్నారు. రాజధాని అమరావతి మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. రాజధాని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందన్నారు. అలాగే, ప్రతి దళిత క్రిస్టియన్కు ఎస్సీ స్టేటస్ వచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పారు.
రాజధాని అమరావతి రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకువస్తామని చింతా మోహన్ ప్రకటించారు. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారని.. అది ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీపైనే అపవాదు వేశారని.. కానీ, విభజన కారకులు మాత్రం హీరోల్లాగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చింతా మోహన్ అన్నారు.
ఇక, భారత దేశాన్ని అమ్మకానికి పెట్టారని.. రూ. వేల కోట్లు ఖర్చు పెట్టి విమానాలు కొనుక్కొని తిరుగుతున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టిన మొట్టమొదటి ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ కేబినెట్ సమావేశానికి కూడా ఆలస్యంగా వస్తారని.. మంత్రివర్గంలో ఏ ఒక్కరి గొంతు వినపడదని పేర్కొన్నారు. చివరికి విద్యుత్ డిస్కంలను అమ్మకానికి పెట్టిన ఘనుడు మోదీ అని అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తోందని.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో స్కాలర్షిప్లతో చదువుకున్న రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారని చింతా మోహన్ అన్నారు. పేదవాడికి అన్యాయం జరుగుతుంటే.. సంపన్నులకు బీజేపీ కొమ్ముకాస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు పని తీరు కూడా అలాగే ఉందన్నారు.
ఇక, ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతా మోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆదానీ అభివృద్ధి కాదని.. పేదల అభివృద్ధి కావాలన్నారు. ఇక, చంద్రబాబు తొందరబాబుగా మారారన్నారు. రాజధాని అమరావతి మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. రాజధాని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందన్నారు. అలాగే, ప్రతి దళిత క్రిస్టియన్కు ఎస్సీ స్టేటస్ వచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పారు.
రాజధాని అమరావతి రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకువస్తామని చింతా మోహన్ ప్రకటించారు. 1990లో డిసెంబర్ నెలలోనే ఏపీని విభజించారని.. అది ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీపైనే అపవాదు వేశారని.. కానీ, విభజన కారకులు మాత్రం హీరోల్లాగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చింతా మోహన్ అన్నారు.
ఇక, భారత దేశాన్ని అమ్మకానికి పెట్టారని.. రూ. వేల కోట్లు ఖర్చు పెట్టి విమానాలు కొనుక్కొని తిరుగుతున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ అని మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టిన మొట్టమొదటి ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ కేబినెట్ సమావేశానికి కూడా ఆలస్యంగా వస్తారని.. మంత్రివర్గంలో ఏ ఒక్కరి గొంతు వినపడదని పేర్కొన్నారు. చివరికి విద్యుత్ డిస్కంలను అమ్మకానికి పెట్టిన ఘనుడు మోదీ అని అన్నారు. దేశంలో గడ్డుకాలం నడుస్తోందని.. రైతులను జీపులతో గుద్ది చంపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు.