యాప్నగరం

ఏపీకి కొత్త ముఖ్యమంత్రి: జగన్‌కు పదవి పోవడం ఖాయం, భోగి లోపే.. కేంద్ర మాజీ మంత్రి సంచలనం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి నుంచి దిగిపోవడంపై కేంద్ర మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 11 Sep 2021, 9:16 pm
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో ముఖ్యమంత్రి మారిపోయే అవకాశం ఉందని బాంబుపేల్చారు. సంక్రాంతి పండుగ లోపే ఏపీలో ముఖ్యమంత్రి పదవి నుంచి సీఎం జగన్ దిగిపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu సీఎం జగన్



పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని ప్రజా ప్రతినిధులు 50 శాతం పక్కదారి పట్టిస్తున్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీ పోతుందన్న దిగులుతో జగన్‌ బయటకు రావడం లేదని, భోగి పండుగ లోపు రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి రాబోతున్నారని చింతా మోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సినిమా టిక్కెట్లు విక్రయించడం అవసరమా అని చింతా మోహన్ ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరమని, అది కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దీపావళిలోపు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.