యాప్నగరం

తిరుమల: భక్తురాలికి అస్వస్థత.. 6 కిలోమీటర్లు మోసుకెళ్లి ఆస్పత్రికి చేర్చిన కానిస్టేబుల్

మంగి నాగేశ్వరమ్మ అనే మహిళ అన్నమయ్య మార్గంలో కాలి నడకన తిరుమలకు బయల్దేరింది. మార్గ మధ్యలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. చుట్టూ అడవి కావడంతో ఆమెను ఎవరూ గమనించలేదు.

Samayam Telugu 24 Dec 2020, 1:57 pm
తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన వెళుతూ అస్వస్థతకు గురైన భక్తురాలిని కాపాడాడు కానిస్టేబుల్. ఆమెను ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లి వాహనంలో ఆస్పత్రికి పంపించి మానవత్వం చాటుకున్నాడు. మంగి నాగేశ్వరమ్మ అనే మహిళ అన్నమయ్య మార్గంలో కాలి నడకన తిరుమలకు బయల్దేరింది. మార్గ మధ్యలో అంతా కొండమార్గం కావడంతో నాగేశ్వరమ్మ కొండ ఎక్కలేక హైబీపీతో గుర్రపుపాదం సమీపంలో సొమ్మసిల్లి పడిపోయింది. నాగేశ్వరమ్మకు సంబంధించిన ఇద్దరు మాత్రమే ఆమె వద్ద ఉన్నా.. వారు ఆమెను మోసుకెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఇంతలో కడప జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా తిరుమలకు పాదయాత్రకు వెళ్లారు.
Samayam Telugu తిరుమల


ఆ పాదయాత్రకు సెక్యూరిటీగా వచ్చిన కడప డీటీసీకి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ భక్తురాలి పరిస్థితిని చూసి చలించిపోయారు. అటవీ ప్రాంతం కావడం, వాహనాలను తీసుకువెళ్లే అవకాశం లేకుండాపోయింది. వెంటనే ఆమెను తన భుజాలపై వేసుకుని ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాడు. అక్కడి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపించారు. సమయానికి అతడు స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. కానిస్టేబుల్ అర్షద్‌‌ను డీజీపీతో పాటూ అధికారులు అభినందించారు. మహిళను కాపాడటంపై ప్రశంసలు కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.