యాప్నగరం

జగనన్న కోసం.. పసిపాపతో కాలినడకన తిరుమలకు దంపతులు, కదిలించే కారణం

West Godavari couple: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఓ యువ జంట.. తమ పాపను ఎత్తుకొని ఊరి నుంచి తిరుపతికి పాదయాత్రగా బయల్దేరింది. తిరుమల కొండపైకి కాలినడకన చేరుకుంది. సీఎం వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఏడుకొండలవాడిని కోరుకుంది. దీని వెనుక కదిలించే ఓ కారణం ఉంది. ఈ దంపతుల పాపకు పుట్టుకతోనే పెద్ద కష్టం వచ్చింది. ఆ సమస్యతో తల్లడిల్లుతున్న ఆ తల్లిదండ్రులను సీఎం జగన్ ఆదుకున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 26 Nov 2022, 10:34 am
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. తమ పసిపాపను ఎత్తుకొని కాలినడకన తిరుమల కొండ ఎక్కారు దంపతులు. తమ పాపకు వచ్చిన కష్టాన్ని తలచుకొని కుమిలిపోతుండగా.. చికిత్స కోసం కోటి రూపాయలు విడుదల చేసి పెద్ద మనసు చాటుకున్న ముఖ్యమంత్రి జగనే తమ దేవుడు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులు. తమ ఊరి నుంచి తిరుమల వరకూ పాదయాత్రగా వచ్చి తిరుమల కొండ ఎక్కారు. సీఎం జగన్‌పై ఆ దంపతులకు ఎందుకు అంత అభిమానం? ఆ చిన్నారికి వచ్చిన కష్టం ఏంటి?
Samayam Telugu West Godavari couple
ఆచంట దంపతులు


పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె పేరు హనీ. పుట్టుకతోనే ఆ పాపకు గాకర్స్ వ్యాధి వచ్చినట్లు తేలింది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో కాలేయం పనిచేయదు. చికిత్స కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

కొన్ని రోజుల కిందట గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కోనసీమ జిల్లా పర్యటనకు వచ్చారు. నాడు కిక్కిరిసిన జనం మధ్య ఆ పాపను ఎత్తుకొని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్న ఆ తల్లిదండ్రులను చూసి, సీఎం జగన్ తన కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లి వద్దకు వెళ్లి పాప సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. తమ చిన్నారి కష్టం గురించి ఆ జంట వివరించింది. దీంతో చలించిపోయిన సీఎం జగన్.. ఆ పాప ఖర్చకయ్యే మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.


సీఎం ఆదేశాలతో ఈ మొత్తం విడుదల కాగా.. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ తమ దేవుడు అంటూ తిరుమలకు పాదయాత్రగా బయల్దేరారు రాంబాబు, లక్ష్మీ దంపతులు. వందల కిలోమీటర్లు నడిచి వచ్చి తిరుమలకు చేరుకున్నారు. తమ చిన్నారిపై దయచూపమని ఏడుకొండలవాడిని కోరుకుంటే, సీఎం జగన్ రూపంలో కరుణించారని కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. తమ చిన్నారితో పాటు సీఎం జగన్‌ను ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నారు.

Hyd: సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. గ్రేట్ జాబ్ సార్
అంత్యక్రియల బిజినెస్.. 2000 కోట్ల టర్నోవర్, పేరేంటో తెలుసా?
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.