యాప్నగరం

Tirupati: జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలిసిపోయింది: సీపీఐ నారాయణ

Tirupati: జగన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ పర్యటనపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జగన్‌కు ఒప్పందం కుదిరిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనా నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 30 Mar 2023, 5:36 pm

ప్రధానాంశాలు:

  • జగన్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
  • ఢిల్లీకి ఎందుకెళ్తున్నారో తెలిసిందన్న నారాయణ
  • బీజేపీని ప్రజా కోర్టులో నిలబెడతామని స్పష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu CPI Narayana
సీపీఐ నారాయణ
Tirupati: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పదే పదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారో అసలు విషయం బట్టబయలైందని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో.. భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని CPI Narayana ఆరోపించారు.
'అమిత్ షాతో జగన్‌ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేసుల నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలని అమిత్ షాతో ఒప్పందం కుదిరింది. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులు మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందంతో వివేకానంద రెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదు. కేంద్రాన్ని నిలదీసి పోలవరం బాధితులను ఆదుకోవాలి' అని నారాయణ డిమాండ్ చేశారు.

'లండన్ నుంచి నీరవ్ మోదీ స్టేట్ మెంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ గాంధీని లండన్ కోర్టుకు రప్పిస్తానని నీరవ్ మోదీ చెప్పడమేంటి..? మోదీకి ఆర్థిక నేరగాళ్లు సపోర్ట్ చేస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ. రాహుల్ గాంధీని మోదీ రాజకీయ హత్య చేశారు. ప్రజా కోర్టులో మోదీని దోషిగా నిలబెడతారు.. ఘోరంగా ఓడిస్తారు. బీజేపీపై రాజకీయ పరమైన ఉద్యమం అవసరం. దేశ్ కీ బచావో- మోదీ హఠావో నినాదంతో.. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం' అని నారాయణ స్పష్టం చేశారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.