యాప్నగరం

Gorantla Madhav వీడియోపై విచారణ.. అదే నిజమైతే వేటు తప్పదన్న డిప్యూటీ సీఎం

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేగుతోంది. ఆ వీడియో తనది కాదని.. మార్ఫింగ్ చేశారంటూ మీడియా ముఖంగా ఆయన ప్రకటించినా, ప్రతిపక్షాలు మాత్రం ఏకిపారేస్తున్నాయి. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం స్పందించగా.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా పార్టీ వైఖరి స్పష్టం చేశారు

Edited byరావు | Samayam Telugu 5 Aug 2022, 11:49 am

ప్రధానాంశాలు:

  • ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో నిజమైతే కఠిన చర్యలు
  • పార్టీ నుంచి వేటు తప్పదంటూ డిప్యూటీ సీఎం క్లారిటీ
  • హిందూపురం ఎంపీ వీడియోపై కొనసాగుతున్న విచారణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gorantla Madhav
ఎంపీ గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేగుతోంది. ఆ వీడియో తనది కాదని.. మార్ఫింగ్ చేశారంటూ మీడియా ముఖంగా ఆయన ప్రకటించినా, ప్రతిపక్షాలు మాత్రం ఏకిపారేస్తున్నాయి. ఈ విషయమై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం స్పందించగా.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా పార్టీ వైఖరి స్పష్టం చేశారు. వీడియోపై విచారణ జరుగుతుందని, అది నిజమైతే వేటు తప్పదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లు గోరంట్ల మాధవ్ గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు. వీడియోపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని.. ఒకవేళ వీడియో వాస్తవమని తేలితే, కఠిన చర్యలు తప్పవంటూ ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా పక్షపాతి ప్రభుత్వం అని.. మహిళలు సంతోషంగా ఉండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని తీసుకువచ్చారని నారాయణస్వామి అన్నారు.

ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఎంక్వైరీ జరుగుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ మహిళా పక్షపాత పార్టీ అని.. తప్పు ఉంటే జగన్‌మోహన్ రెడ్డి ఉపేక్షించరని ఆయన స్పష్టం చేశారు. ఎంక్వైరీలో నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో నిన్న గోరంట్ల మాధవ్ స్పందిస్తూ.. తనపై కక్షపూరితంగా కుట్ర చేస్తు్న్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకే కావాలని తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలాంటి చర్యలకు పూనుకున్నారని.. ఫొరెన్సిక్‌లో నిజనిజాలు తెలుస్తాయన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఎస్పీ, సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఫిర్యాదు చేశామని ఎంపీ మాధవ్ తెలిపారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.