యాప్నగరం

తిరుమలకు భక్తుల రద్దీ: అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ధర్నా.. పోలీసుల మోహరింపు

అనంతపురం, తమిళనాడు, కర్ణాటకలలోని వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు కాలినడకన శ్రీవారి మెట్టుకి చేరుకున్నారు. దీంతో భక్తులను అదుపు చేసేందుకు అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.

Samayam Telugu 23 Dec 2020, 11:32 am
ఆందోళనకు దిగారు. తిరుమలకు వెళ్ళనివ్వకపోవడంతో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ధర్నాకు దిగారు. దర్శనానికి అనుమతించాలంటూ నినాదాలు చేశారు. తిరుమలకు వెళ్లకుండా వెనుదిరిగేది లేదంటూ అక్కడే బైఠాయించారు. అనంతపురం, తమిళనాడు, కర్ణాటకలలోని వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు కాలినడకన శ్రీవారి మెట్టుకి చేరుకున్నారు. అలాగే గోవింద దీక్ష భక్తులు కూడా టోకెన్లు లేకుండానే తమను దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో భక్తులను అదుపు చేసేందుకు అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. ఒక్కసారిగా జనాలు రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. టీటీడీ తమకు టికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు ఉంచినా నిమిషాల్లో అయిపోయాయని.. తమను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu తిరుమల


మరోవైపు తిరుమల శ్రీ వెంకన్న సర్వదర్శనం టోకెన్లను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. సోమవారం నుంచి జనవరి 2వ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 24 వరకు సర్వదర్శనం టోకెన్లు జారీకాగా.. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని స్థానికులకు మాత్రమే టీటీడీ టోకెన్లను జారీ చేయనుంది. సోమవారం నుంచి జనవరి 3 వరకు శ్రీవారి దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కరోనా నిబంధనలు నేపథ్యంలో దర్శన టిక్కెట్లు లేని భక్తులు తమ ప్రయాణం వాయిదా వేసుకోవాలని భక్తులను కోరుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.