యాప్నగరం

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలు ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యలే అన్నారు లోకేష్. ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందన్న మాజీ మంత్రి.

Samayam Telugu 11 May 2021, 7:43 am

ప్రధానాంశాలు:

  • తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై లోకేష్ స్పందన
  • ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలంటూ లోకేష్ ట్వీట్
  • ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నారా లోకేష్
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలు ముమ్మాటికీ జగన్ సర్కారు చేసిన హత్యలే అన్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలున్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందని.. పది మందికి పైగా మృతిచెందారని తెలిసి షాకయ్యాను అన్నారు.
మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోందన్నారు లోకేష్. అర్జంటుగా వారికి ఆక్సిజన్ అందించి కాపాడాలని కోరారు. ఆక్సిజన్ అందక ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులు ప్రతీరోజూ మృతి చెందుతున్నా.. ముఖ్యమంత్రి కనీసం ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా కూడా తీయడం లేదంటే, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్క లేనితనమో స్పష్టం అవుతోందన్నారు.
తిరుపతి రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. కొవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సమాచారం. ఐసీయూలోని బాధితులు ఊపిరాడక అల్లాడారు. అత్యవసర శ్వాస ఆడించేందుకు వైద్యులు సీపీఆర్‌ చేశారు. బంధువులు కూడా బాధితులకు గాలి ఆడేందుకు విసిరారు. ఆక్సిజన్‌ ట్యాంకు ఖాళీ కావడంతో 5 నిమిషాల పాటు సరఫరా నిలిచిపోయింది. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకతో సరఫరాను సాంకేతిక బృందం పునరుద్ధరించింది.

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అధికారులు మంగళవారం ఉదయం ఆస్పత్రిని తరలించారు.. పరిస్థితిపై ఆరా తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.