యాప్నగరం

మదనపల్లె: అమ్మాయి నుంచి రాంగ్ కాల్.. లాడ్జికి పిలిచి, జీవితంలో మర్చిపోలేని విధంగా.. షాకింగ్!

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ అమ్మాయి నుంచి రాంగ్ కాల్ అతడు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది.

Samayam Telugu 14 May 2021, 10:10 pm
అమ్మాయి నుంచి వచ్చిన ఓ రాంగ్ కాల్‌కు ఆకర్షితుడైన ఓ యువకుడు చివరికి, చిత్రహింసలకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంగ్‌ కాల్‌ వివాదం ఓ యువకుడిని చిత్రహింసలకు గురిచేసింది. కొందరు యువకులు ఆగ్రహావేశాలతో యువడికిపై మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మదనపల్లె టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన మహేష్ (18)కు ఇటీవల ఓ యువతి మొబైల్‌ నుంచి రాంగ్‌ కాల్‌ వచ్చింది. కొన్ని రోజుల వరకు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, సదరు యువతి సోదరుడు, అతడి స్నేహితులు కలసి రెండు రోజుల క్రితం మహేష్‌కు ఫోన్‌ చేసి మదనపల్లెలోని ఓ లాడ్జి వద్దకు రమ్మన్నారు.

ఒకవేళ లాడ్జికి రాకపోతే ఇంటికొచ్చి కొడతామని మహేష్‌ను వాళ్లు బెదిరించారు. దీంతో అతడు లాడ్జి వద్దకు రాగానే, అక్కడే ఉన్న రౌడీషీటర్‌ రెడ్డి పవన్‌, మోహన్‌ మరికొందరు కలసి మహేష్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి.. మూకుమ్మడిగా దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటంతో టూ టౌన్‌ పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు నిజం తెలిసింది.

దీంతో గురువారం పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించగా, అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడ్డ యువకులను గుర్తించారు. అనంతరం మహేష్‌ను పోలీస్ స్టేషన్‌కు రప్పించి అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దాదాపు 10 మంది యువకులు తనను చిత్రహింసలకు గురిచేసి దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.