యాప్నగరం

హనుమంతుడి జన్మస్థలంపై రచ్చ.. టీటీడీ, కర్ణాటక సంస్థ మధ్య వివాదం.. ఈ నెల 27న!!

తిరుమలలో హనుమంతుడి జన్మస్థలం ఎక్కడ అనే దానిపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. దీనిపై గురువారం చర్చలు జరగనున్నాయి.

Samayam Telugu 26 May 2021, 9:04 pm
హనుమంతుడి జన్మస్థలంపై తీవ్ర చర్చోపచర్చలు జరగుతున్నాయి. తిరుమలలో అంజనాద్రిలో హనుమంతుడు జన్మించారని శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. టీటీడీ ప్రకటనను కర్ణాటక రాష్ట్రానికి చెందిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై టీటీడీతో చర్చకు సిద్ధమైంది.
Samayam Telugu హనుమంతుడి ప్రతీకాత్మక చిత్రం


గురువారం (మే 27వ తేదీన) తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఇరుపక్షాల మధ్య చర్చ జరుగబోతోంది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొననున్నారు. టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొననున్నారు.

పోల్: సీఎం జగన్ రెండేళ్ల పాలన ఎలా ఉంది ? సమయం ఒపీనియల్ పోల్

కాగా, శ్రీరామనవమి రోజున తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది. టీటీడీ ప్రకటనపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అప్పుడే తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. టీటీడీకి పరుష పదజాలంతో ట్రస్ట్‌ లేఖలు కూడా రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి హనుమద్‌ ట్రస్ట్‌ సవాల్‌ విసిరింది. ఈ నేపథ్యంలో గురువారం హనుమంతుని జన్మస్థానంపై ఆధారాలను ఇరుపక్షాలు బయటపెట్టనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.