యాప్నగరం

తిరుమల శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్

వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Samayam Telugu 22 Jan 2021, 11:32 am
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న జనసేనానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Samayam Telugu పవన్ కళ్యాణ్


ఏడాది నుంచి స్వామివారి ఆశీస్సుల కోసం రావాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా ప్రభావంతో రాలేకపోయానని.. ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయి అన్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతి పర్యటనకు వచ్చారు. పార్టీ పీఏసీ సమావేశం నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటూ కీలక అంశాలపై నేతలతో చర్చించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.