యాప్నగరం

Janasena Party: సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. నమ్మొద్దంటున్న జనసేన పార్టీ

Pawan Kalyan, ప్రధాని మోదీ భేటీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ప్రధానితో పవన్‌ కళ్యాణ్ సమావేశాన్ని జనసేన పార్టీ గౌరవిస్తుందని.. రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసమే జనసేనాని ఆలోచన ఉంటుంది అన్నారు. ఏ రోజూ పదవుల కోసం పవన్ ఆలోచన ఉండదన్నారు. వైఎస్సార్‌సీపీ విముక్త రాష్ట్రం కోసం కచ్చితంగా అన్ని పక్షాలు కలిసి పోరాడాలి అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరక ఓటు చీలకూడదు అన్న దానిపై ఓ ప్రణాళికతో ముందుకు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 19 Nov 2022, 7:13 am

ప్రధానాంశాలు:

  • పవన్ కళ్యాన్, మోదీ భేటీపై నాదెండ్ల కామెంట్స్
  • ఈ సమావేశంపై వస్తున్న రూమర్స్ అర్థరహితం
  • ప్రధాని మోదీతో భేటీని జనసేన పార్టీ గౌరవిస్తుంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan
ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీ నిర్ణయాలను జనసేన పార్టీ (Janasena Party) వెల్లడించదన్నారు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. మోదీ, పవన్ కళ్యాణ్ భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు. ఎన్నికల సందర్భంలో జరగాల్సిన చర్చను ఇప్పుడు తేవడం సరికాదన్నారు. ప్రధానితో పవన్‌ కళ్యాణ్ సమావేశాన్ని జనసేన పార్టీ గౌరవిస్తుంది అన్నారు. ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బహిర్గతం చేయాలనే ఆలోచన లేదన్నారు. ఈ సమావేశంపై వస్తున్న రకరకాల భాష్యాలకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.
ప్రధాని మోదీ, పవన్‌ కళ్యాణ్‌ సమావేశంలో అంశాలని చెబుతూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు గురించి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే పవన్‌ కళ్యాణ్‌ ఆలోచన ఉంటుందన్నారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజల మంచి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న కోణంలోని సమావేశం జరిగింది అన్నారు. పదవుల కోసం పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు ఆలోచించరన్నారు. ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం మాత్రమే పవన్‌ ఆలోచించి మాత్రమే ఏ మాట అయినా మాట్లాడుతారన్నారు.
వైఎస్సార్‌సీపీ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భవిష్యత్తులో అనుసరించాల్సిన విషయాలు గురించి చర్చ జరిగింది అన్నారు. కొన్ని అంశాలు ఎన్నికల సమయంలో రాజకీయంగాను చర్చకు వస్తాయి అన్నారు. వాటికి రకరకాల భాష్యాలు చెప్పి, అన్ని విషయాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం విషయంలో సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు.

వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం కచ్చితంగా అన్ని పక్షాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు. రాష్ట్రానికి వైఎస్సార్‌సీపీ వల్ల ఎంత నష్టమో ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. కచ్చితంగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరతామని.. పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌‌కు ఎంత అవసరమో తెలియచెప్పేలా ప్రచారం చేస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరక ఓటు చీలకూడదు అన్న దానిపై ఓ ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో ముందుకు వెళ్తామన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందన్నారు మనోహర్. నాలుగు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోయారన్నారు. తన సొంత జిల్లాలో జరిగిన ఘోరంపై సీఎం పది రోజుల తర్వాత స్పందించారన్నారు. మూడునెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సీఎం హామీ నెరవేరలేదన్నారు. ఎకరాకు 12,500 ఇస్తామని చిల్లిగవ్వ ఇవ్వలేదని.. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితిపై పవన్ కళ్యాణ్‌కు నివేదిక ఇస్తామన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.