యాప్నగరం

చిత్తూరు: 22 ఏనుగుల గుంపు ఒకేసారి రోడ్డుపైకి.. వణికిపోయిన వాహనదారులు

Chittoor District Elephants కలకలంరేపుతున్నాయి. కొద్దిరోజులుగా గజరాజులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, స్థానికులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఓ ఏనుగులు గుంపు కలకలంరేపాయి. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో గజరాజులు రోడ్డుపై ప్రత్యక్షమయ్యాయి. దీంతో వాహనదారులు భయంతో వణికిపోయారు. ఆ గుంపు అలాగే రోడ్డుపై ఆగిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేకపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని రోడ్డుపై ఉన్న గజరాజుల గుంపును అక్కడి నుంచి తరిమేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Dec 2022, 5:31 am

ప్రధానాంశాలు:

  • చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు
  • రోడ్డుపై తిష్ట వేసిన గజరాజులు
  • వణికిపోయిన వాహనదారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chittoor Elephents
చిత్తూరు, తిరుపతి జిల్లాలవాసులను గజరాజులు హడలెత్తిస్తున్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ హల్ చల్ చేస్తున్నాయి. పంటపొలాలను ధ్వంసం చేస్తూ రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి . తాజాగా పలమనేరు రూరల్ మండలంలోని మొసలిమడుగులో ఏనుగుల గుంపు హడావిడి చేసింది.
ఏవైపు నుంచి ఎలా వచ్చాయో తెలియదు కానీ.. మొత్తం 22 ఏనుగులు ఒకేసారి మొసలి మడుగు గ్రామ సమీపంలోని రోడ్డుపైకి వచ్చేశాయి. రోడ్డుపక్కనే కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కంచెదాటి అడవిలోకి వెళ్లలేక రోడ్డుపైనే చాలాసేపు ఉండిపోయాయి గజరాజులు. ఒకేసారి అన్ని ఏనుగులు గుంపుగా రోడ్డుపై తిష్టవేయటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు కూడా భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల గుంపును తరమలేక.. చూస్తూ ఉండిపోయారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

రహదారిపై ఏనుగులు తిష్టవేసిన విషయాన్ని వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. గజరాజులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరిమివేశారు. అయితే ఇంత పెద్దసంఖ్యలో ఏనుగులు గుంపుగా సంచరిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. గజరాజులు తమ ఊరిపై ఎక్కడ దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.