యాప్నగరం

మదనపల్లె: 4 రోజులుగా అనుమానంగా బైక్.. అటవీప్రాంతంలోకి వెళ్లి చూస్తే, తీవ్ర విషాదం

Madanapalle Love Couple మదనపల్లె సమీపంలో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ఒకే చున్నీకి ఉరి వేసుకున్నారు.. నాలుగు రోజుల క్రితం వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆ సమీపంలో పల్సర్ బైక్ ఉందని స్థానికులు చెబుతున్నారు. బైక్ వివరాల ఆధారంగా చనిపోయిన వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ బైక్ అనంతపురం జిల్లాకు చెందినదిగా చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 May 2023, 1:16 pm

ప్రధానాంశాలు:

  • అన్నమయ్య జిల్లాలో దారుణం
  • ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది
  • బైక్ ఆధారంగా ఆరా తీస్తున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Madanapalle Couple Suicide
అన్నమయ్య జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలంరేపింది. మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీలోని అబ్బగొంది అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరులు గొర్రెలు మేపుకొనేందుకు వెళ్లగా దుర్వాసన వచ్చింది.. అనుమానంతో వెళ్లి చూస్తే ఈ దారుణం బయటపడింది. ప్రేమికులు ఇద్దరూ చున్నీకి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు.
నాలుగు రోజులుగా అటవీ ప్రాంతం కింద భాగంలో ఏపీ 02 ఏజడ్‌ 2480 పల్సర్‌ బైక్ ఉందని స్థానికులు అంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ ప్రేమ జంట ద్విచక్ర వాహనంలో కొండపైకి వెళ్లారని.. మళ్లీ తిరిగి రాలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రేమికులే ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ బైక్ నంబరు ఆధారంగా యజమాని పేరు ఎం.వెంకట రమణ ఉంది. రమణ తండ్రి పేరు ధనుంజయ అని వస్తోంది. బైక్ నంబరు ప్లేటు ఆధారంగా అనంతపురం జిల్లా ఉదిరిపికొండగా రిజిస్ట్రేషన్‌ అయినట్లు సమాచారం ఉంది. ఈ జంట నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరికొన్ని ఘటనలు జరిగాయి. సోమల మండలం ఆవులపల్లె రిజర్వాయర్‌లో పనులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ కూలి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం నుంచి బొప్పాదాస్‌ అనే కూలి మాయం అయ్యాడు. దీంతో అనుమానం వచ్చి వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం పెద్దఉప్పరపల్లె దగ్గర తాహీద్‌ అనే వ్యక్తి మామిడితోటలో బొప్పాదాస్‌ డెడ్‌బాడీని గుర్తించారు. బొప్పాదాస్‌ అనార్యోగంతోనే చనిపోయినట్లు తోటి కూలీలు చెబుతున్నారు.

అలాగే నాగలాపురం తూర్పు ఎస్సీకాలనీకి చెందిన తులకానాం ఎద్దులబండిలో ఇసుకను తీసుకురావడానికి నందనం దగ్గర అరణియార్‌ కాలువకు బయల్దేరాడు. ఇంతలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఎద్దులబండి కాడిని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో బండిపై నుంచి కిందపడ్డ తులకానాం ప్రాణాలు కోల్పోయాడు. అలాగే శ్రీకాళహస్తిలో హరిత హోటల్‌కు సమీపంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టగా డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. అతడ్ని తంగేళ్లపాళెం ఎస్సీ కాలనీకి చెందిన ప్రకాష్‌‌గా గుర్తించారు. మట్టి తరలిస్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు రామచంద్రాపురం మండలానికి చెందిన చిన్నబ్బనాయుడు పొలంలోని వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లారు. అక్కడ తెలిసినవారితో కలిసి మద్యం సేవించారు. ఎండ తీవ్రంగా ఉందంటూ ఈతకని వెంకటాచారి అనే వ్యక్తి బావిలోకి దిగాడు. వెంకటాచారి నీట మునగడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఎంతకు బయటకు రాక పోవడంతో మిగిలిన ఇద్దరూ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.