తిరుమల (Tirumala) శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందజేశారు. మహారాష్ట్ర కు చెందిన సునీల్ లఖన్ కుమార్ అగర్వాల్ ఎస్వీబీసీ ట్రస్ట్ (SVBC Trust) కు రూ.11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర, సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్కు దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి ఈ మేరకు డీడీని అందజేశారు. మరోవైపు చెన్నై టి నగర్ లోని శ్రీవారి ఆలయం త్వరలో పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Yv Subba Reddy) వెల్లడించారు. చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం జరిగిన విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో ఛైర్మన్ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 9 నుంచి 9.45 గంటల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని చెప్పారు. ప్రఖ్యాత సినీనటి శ్రీమతి కాంచనతోపాటు వారి కుటుంబ సభ్యులు రూ.40 కోట్లకు పైగా విలువైన ఈ స్థలాన్ని టీటీడీ కి విరాళంగా అందించారని తెలిపారు. దాతలతోపాటు చెన్నై భక్తుల విజ్ఞప్తి మేరకు ఈ స్థలంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించినట్టు చెప్పారు.
టీటీడీ (TTD) రూ.10 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టిందని, దీంతోపాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆలయంలో శుక్రవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తరహాలోనే ఇక్కడ నిత్య కైంకర్యాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు.
మరోవైపు గురువారం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ఛాయ జలాధివాసం, బింబ నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం శయనాధివాసం చేపట్టారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరోవైపు తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం దగ్గర మెట్లోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 17న ఉదయం 6 గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరుగనుందని తెలిపారు. అంతేకాదు తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మార్చి 18 నుంచి 21 వరకు.. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం దగ్గర సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సంగీతం, హరికథ నిర్వహించనున్నారు.
టీటీడీ (TTD) రూ.10 కోట్లతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టిందని, దీంతోపాటు చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆలయంలో శుక్రవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తరహాలోనే ఇక్కడ నిత్య కైంకర్యాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు.
మరోవైపు గురువారం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ఛాయ జలాధివాసం, బింబ నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం శయనాధివాసం చేపట్టారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరోవైపు తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం దగ్గర మెట్లోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 17న ఉదయం 6 గంటలకు మెట్లోత్సవం వైభవంగా జరుగనుందని తెలిపారు. అంతేకాదు తాళ్లపాకలోని ధ్యానమందిరంలో మార్చి 18 నుంచి 21 వరకు.. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం దగ్గర సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సంగీతం, హరికథ నిర్వహించనున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News