యాప్నగరం

ప్రేయసిని అసభ్యంగా మాట్లాడడని.. స్నేహితుడినే.. దారుణం

Chittoor: తిరుపతిలో దారుణం జరిగింది. తన ప్రేయసిని అసభ్యంగా మాట్లాడడని ఓ వ్యక్తిని నిందితుడు హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు.

Samayam Telugu 19 Oct 2021, 11:11 am
తిరుపతిలో దారుణం జరిగింది. తన ప్రేయసిని అసభ్యంగా మాట్లాడడని ఓ వ్యక్తిని నిందితుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఇరువురు గొడవ పడి.. హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu తిరుపతి


పూర్తి వివరాలు ఇలా.. జీవకోనలో నివాసం ఉంటున్న శంకర్, గిరి ఇద్దరు స్నేహితులు. గిరి (25) పెయింటర్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. గిరి, శంకర్ కలిసి ఇందిరా మైదానంలో సోమవారం సాయంత్రం మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పాత కక్షలు గుర్తు తెచ్చుకుని గొడవకు దిగారు.

ఘర్షణలో శంకర్ ప్రేయసి పట్ల గిర అసభ్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన శంకర్.. గిరి తలపై ఇటుకతో బాది హత్య చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.