యాప్నగరం

మదనపల్లెలో మరో ఘోరం.. భార్యను చంపి భర్త నాటకం.. పెళ్లైన ఆర్నెళ్లకే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఆర్నెళ్లకే దారుణంగా చంపేశాడో కసాయి భర్త. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి దారుణం బయటపడింది.

Samayam Telugu 28 Jan 2021, 6:59 pm
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. మూఢభక్తి, అంధ విశ్వాసాలతో కన్నకూతుళ్లను పొట్టనబెట్టుకున్న తల్లిదండ్రుల ఘటన మరువక ముందే దారుణ ఘటనతో మదనపల్లో మరోసారి ఉలిక్కిపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఆర్నెల్లు తిరక్కుండానే కిరాతకంగా చంపేశాడో కసాయి భర్త. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ హైడ్రామాకు తెరతీసి దొరికిపోయాడు. ఈ అత్యంత దారుణ ఘటన మదనపల్లె మండలంలోని నిరుగట్టువారిపల్లెలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


గ్రామానికి చెందిన రామాంజనేయులు అదే ప్రాంతానికి చెందిన యువతి ఉమ ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని ఆర్నెల్ల కిందట పెళ్లి చేసుకున్నారు. అంతలో ఏమైందో తెలియదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను రామాంజనేయులు అమానుషంగా అంతమొందించాడు. ఉమని కిరాతకంగా హత్య చేసి నాటకానికి తెరతీశాడు. తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తేలడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అసలు భార్యను ఎందుకు చంపేశాడనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.