యాప్నగరం

ఇదేం విచిత్రం: పసుపు పూసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని.. వ్యక్తి ఆత్మహత్య

ఓ వ్యక్తి తాను చనిపోకముందే మొఖానికి పసుపు పూసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని.. మెడలో పూల దండం సైతం వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటు చేసుకుంది.

Samayam Telugu 27 Jan 2022, 8:22 pm
ఎవరైనా చనిపోతే మృతదేహానికి పసుపు పూసి. కుంకుమ బొట్టు పెట్టి పూలమాలవేసి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఓ వ్యక్తి మాత్రం తాను చనిపోకముందే మొఖానికి పసుపు పూసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని.. మెడలో పూల దండం సైతం వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
Samayam Telugu చిత్తూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య


అడవిబూదుగూరు పంచాయతీ వినాయకపురం గ్రామానికి చెందిన బుడ్డప్ప అనే వ్యక్తి ఆస్తి తగదాల నేపథ్యంలో గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బుడ్డప్ప మొహానికి పసుపు పూసుకుని.. కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో పూలమాల వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బుడ్డప్ప ఎందుకు ఇలా చేశాడనేది స్థానికులకు కూడా అంతుచిక్కడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.