యాప్నగరం

తిరుమల శ్రీవారి హుండీలో డబ్బు చోరీ చేస్తుండగా.. దిమ్మతిరిగే ట్విస్ట్!

తిరుమల శ్రీవారి ఆలయంలోనే చోరీకి ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. చివరికి అధికారుల ఎంట్రీ ఇవ్వడంతో..!

Samayam Telugu 23 Mar 2021, 5:12 pm
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీకే కన్నం వేయాలని చూశాడు కొందరు ప్రబుద్ధులు. పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలోని హుండీలో కొందరు యువకులు చోరీకి ప్రయత్నించాడు. నిందితుడు హుండీలోని రూ. 30 వేలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలో విజిలెన్స్ అధికారులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు.
Samayam Telugu తిరుమల శ్రీవారి ఆలయం


సీసీటీవీ కెమెరాల ద్వారా చోరీ బండారాన్ని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు నిందితులను రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే నిందితులను అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు. కాగా, శ్రీవారి ఆలయం ప్రధాన హుండీలోనే దుండగులు చోరీకి ప్రయత్నించడం తిరుమలలో తీవ్ర కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.