యాప్నగరం

చిత్తూరు: పాడెపై నుంచి లేచినా వెంటాడిన దురదృష్టం.. 24 గంటల్లోనే మరో ట్విస్ట్

గుర్తు తెలియని వ్యక్తి ఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చెట్టు కింద వ్యక్తిని పరిశీలించి చనిపోయాడని నిర్ధారించుకున్నారు. ఊరి శివారులో గుంతను తవ్వించి, పూడ్చి పెట్టాలని భావించారు.

Samayam Telugu 23 Dec 2020, 7:35 am
చిత్తూరు జిల్లా మదనపల్లెలో అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా బతికిన వ్యక్తిని మళ్లీ మరణం వెంటాడింది. పాపం పాడె వదిలినా ప్రాణం నిలవలేదు. 24 గంటలు గడవక ముందే ప్రాణాలు విడిచాడు. రెండు రోజుల క్రితం మదనపల్లె మండలం కట్టుబావి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని చెట్టు కింద వ్యక్తిని పరిశీలించి చనిపోయాడని నిర్ధారించుకున్నారు.
Samayam Telugu చిత్తూరు జిల్లా


ఆ ఊరి శివారులో గుంతను తవ్వించి, పూడ్చి పెట్టాలని భావించారు. అతడ్ని ఖననం చేసేందుకు పాడెపై మోసుకెళుతుండగా ఒకసారిగా లేచి కూర్చున్నాడు. అందరూ అవాక్కయ్యారు.. భయంతో వణికిపోయారు. వెంటనే అతడ్ని 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.. చికిత్స అందించారు. కానీ అతడు మంగళవారం వేకువజామున కన్నుమూశారు. పాపం 24 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్య సిబ్బంది తెలిపారు. అతడి వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూరల్‌ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.