యాప్నగరం

వీడేం దొంగండీ బాబూ.. ఏం తీసుకెళ్లాడో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..!!

Samayam Telugu 12 Oct 2021, 5:41 pm
దొంగతనానికి వస్తే ఎవడైనా ఇంట్లో కాస్ట్లీ వస్తువులు ఎక్కడున్నాయా అని వెతుకుతారు. కొందరైతే అన్నీ దోచుకుని కుదిరితే పనికి ఆహార పథకం కింద అక్కడే భోజనం గట్రా కూడా కానిచ్చేస్తారు. కానీ ఈ దొంగ మాత్రం కాస్తంత విచిత్రంగా ఉన్నాడు. వీడు చేసిన దొంగతనాన్ని చూస్తే దొంగలందు ఈ దొంగవేరయా అంటారు.
Samayam Telugu roberry


శ్రీకాకుళానికి చెందిన బి.లక్ష్మణరావు తిరుపతి రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివజ్యోతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఇంటికి తాళాలేసి డ్యూటీకి వెళ్లాడు. అయితే డ్యూటీ ముగిశాక మంగళవారం ఉదయం ఇంటికొచ్చి చూసే సరికి షాక్‌కు గురయ్యాడు.

ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అలిపిరి పోలీసులు క్లూస్ టీంతో సహా వచ్చి అక్కడ ఆధారాలు సేకరించారు. చోరీకి పాల్పడిన దొంగ ఇంట్లోని 30 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.5 వేల నగదుతో పాటు ఓ మిక్సీని కూడా అపహరించాడు. డబ్బు, బంగారం అంటే ఎవడైనా దోచుకెళ్తాడు.. మరి వీడేంటో వెరైటీగా వాటితో పాటు మిక్సీ కూడా దొంగతనం చేసేశాడు. పోలీసులకు కూడా ఈ విషయం అర్థం కాలేదు.. బంగారం, వెండి, డబ్బు తీసుకుపోయాడు.. మరి ఈ మిక్సీ ఎందుకబ్బా అని ఆలోచనలో పడ్డారు. పాపం ఆ మిక్సీతో వాడికేం అవసరం ఉందోలే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.