యాప్నగరం

తిరుపతిలో కబడ్డీ పండగ.. నేషనల్ కబడ్డీ పోటీలకు సర్వం సిద్ధం

జాతీయ కబడ్డీ క్రీడలు నిర్వహణతో దేశం తిరుపతి వైపు చూసేలా నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తున్నదని తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఇందిరా గాంధీ మైదానంలో ముందస్తుగా ఎగ్జిబిషన్ కబడ్డీ క్రీడలు నిర్వహిం

Samayam Telugu 29 Dec 2021, 11:06 pm
జాతీయ కబడ్డీ క్రీడలు నిర్వహణతో దేశం తిరుపతి వైపు చూసేలా నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తున్నదని తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఇందిరా గాంధీ మైదానంలో ముందస్తుగా.. ఎగ్జిబిషన్ కబడ్డీ క్రీడలను ఘనంగా నిర్వహించారు.
Samayam Telugu కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు


ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ పిల్లల్లో చదువుతో జ్ఞానం వచ్చినా క్రీడల వల్ల మానసిక ఆరోగ్యం కలుగుతుందని.. నగరంలో జనవరి 5 నుంచి 9 వరకు జరగనున్న క్రీడలను తిరుపతి నగరవాసులు వీక్షించి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 22 రాష్ట్రాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. చదువుతో పాటు పిల్లల్లో నాగరికత, శారీరక శక్తి పెరగాలన్నారు. తిరుపతిలో లక్ష మంది విద్యార్థులు పైగా ఉన్నారని క్రీడలపై తల్లిదండ్రులు వారిలో ఆసక్తి పెంచాలని అన్నారు.

నగర మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ గత మూడు నెలలుగా శాసన సభ్యుల స్ఫూర్తితో కౌన్సిలో పెట్టి పనులు, అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. గ్రామీణ క్రీడలు అంతరించరాదనే సంకల్పంతో నిర్వహిస్తున్నామని, ఆదరించాలని కోరారు. కలెక్టర్ ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ కోవిడ్ -19 కారణంగా పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఇంటికే పరిమితమై మొబైల్ ఫోన్లకు, టీవీలకు, ట్యాబ్ లకు పరిమితమయ్యారని.. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలు బయటికి వచ్చి ఆనందిస్తారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.