యాప్నగరం

Tirupati: ముగ్గురు పిల్లలతో తల్లీ మిస్సింగ్.. ఏమయ్యారు?

భర్తతో గొడవపడిన భార్య.. తన ముగ్గురు పిల్లలతో కలసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరు కవలల, మరో కూతురితో కలసి కనిపించకుండా పోయింది.

Samayam Telugu 24 Jan 2021, 1:11 pm
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని ఏర్పేడులో తల్లీపిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. కవల పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయింది. సీతారాంపేటకి చెందిన గంగయ్య యాదవ్ కుమార్తె సునీతకి ఏర్పేడులోని యాదవ వీధికి చెందిన గురవయ్యతో 14 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కవల పిల్లలు నవ్య, నవీన్ యాదవ్(12) సహా లావణ్య(9) ఉన్నారు. భర్తతో గొడవపడిన సునీత పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సునీత తండ్రి గంగయ్య యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. తన కూతురు, పిల్లలతో సహా కనిపించకుండా పోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎటైనా వెళ్లిపోయిందా? లేక అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందా? అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
missing


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.