చిత్తూరు జిల్లా నగరి నియోజవర్గంలో ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీ ప్రారంభమైంది. పుత్తూరు మున్సిపాలిటీ పరిధి గోవిందపాలెంలో మినీ అవుట్లెట్ ఫిష్ ఆంధ్ర ఫ్రాంచైజీకు ఎమ్మెల్యే రోజా శ్రీకారం చుట్టారు. టెక్నాలజీని కలిపి మత్స్యకారుల్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు తన నియోజకవర్గ పరిధిలో లైవ్ ఫిష్ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. అధునాతనంగా ఫిష్ ఆంధ్రను ముందుకు తీసుకొచ్చిన మత్స్యకార వర్గానికి అభినందనలు తెలియజేశారు. మాంసాహారంలో చేపలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు రోజా. చేపలలో పుష్కలమైన పోషకాలు అధిక మొత్తంలో ఉన్నాయంటున్నారు. డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు.. ఫిష్ ఆంధ్ర.. ఫిట్ ఆంధ్ర అయ్యిందన్నారు. చేపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫిష్ ఆంధ్ర ప్రారంభించిన తర్వాత నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, రోజా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజా తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర ఔట్ లెట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఔట్ లెట్లలో చేపలు, రొయ్యలు అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం 30 వేల రూపాయలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.
ఏపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర ఔట్ లెట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఔట్ లెట్లలో చేపలు, రొయ్యలు అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం అనే నినాదంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం 30 వేల రూపాయలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు.