యాప్నగరం

నెల్లూరు: ఎస్సీ కాలనీకి సతీష్ రెడ్డి పేరు.. మంత్రి ముందే వ్యక్తి.. షాకింగ్!

ఎస్సీ కాలనీ పేరును డీఆర్‌డీఓ చైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి నగర్‌గా పేరు మార్చడంపై ఒక్కసారిగా అలజడి రేగింది.

Samayam Telugu 17 Jan 2021, 6:56 pm
నెల్లూరు జిల్లాలో ఎస్సీ కాలనీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్‌డీఓ) చైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి పేరు పెట్టడం తీవ్ర దూమారం రేపింది. జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముందే ఓ వ్యక్తి షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడు. ఎస్సీ కాలనీకి సతీష్ రెడ్డి పేరు పెట్టినందుకు నిరసనగా మంత్రి గౌతమ్ రెడ్డి ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగులు మందు తాగి మంత్రి గౌతమ్ రెడ్డి కాన్వాయ్ ముందు పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
Samayam Telugu ఎస్సీ కాలనీకి సతీష్ రెడ్డి పేరు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో తూర్పు హరిజనవాడ కాలనీకి.. గుండ్రా సతీష్ రెడ్డి నగర్‌గా పేరు మార్చారు. అయితే తమ కాలనీకి ఎందుకు పేరు మార్చారంటూ మెరా భాస్కర్ అనే వ్యక్తి మంత్రి గౌతమ్ రెడ్డి కాన్వాయ్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని అడ్డుకున్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.